గుండాల మార్చి 27(మన్యం మనుగడ) మండలంలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. దామల చెరువు గ్రామంలో ఇటీవల మరణించిన కల్తీ సుందర్ రావు కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రేగుల గూడెం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త కుంజ వెంకటేశ్వర్లు రోడ్డుప్రమాదంలో మరణించడంతో వారి స్వగ్రామానికి కుటుంబ సభ్యులను పరామర్శించి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ అ నాయకులు భవాని శంకర్, గుండాల మండల అధ్యక్షులు భాస్కర్, ఆళ్లపల్లి మండల అధ్యక్షులు నరసింహారావు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: