- ఏఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన తాడ్వాయి పోలీసులు.
మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు ఏఎస్పీ ఆధ్వర్యంలో మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని జలగలంచ,లక్ష్మయ్య గుంపు, కొండపర్తి గొత్తికోయ గుంపుల్లో పసర సీఐ శంకర్,తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ను నిర్వ హించారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ. అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వకూడదని హెచ్చరించారు. కొత్త వాళ్ళు అనుమానాస్పద వ్యక్తులు వస్తే సమాచారం అందించాలని,సూచించారు.
ఇలాంటి విషయాల్లో ఏదైనా సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదిచాలని మీకు అండగా ఉంటామని హామీఇచ్చారు.
కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనంతరం గొత్తికోయ పిల్లలకు నోట్ బుక్స్,పెన్నులు, పెన్సిళ్ళు,టూత్ బ్రషులు, టూత్ పేస్టులు అందజేశారు. బడి ఈడు పిల్లలు అందరూ చదువుకోవాలని అందుకు మేము ఎల్ల వేళలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం గూడెల్లోని చిన్నా పెద్దలందరినీ ఆత్మీయంగా పలకరించారు.
ఈ కార్యక్రమంలో పసర సీఐ శంకర్,తాడ్వాయి ఎస్సై సీఎచ్.వెంకటేశ్వరరావు, తాడ్వాయి పోలీసు స్టేషన్ సిబ్బంది సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: