గుండాల మార్చి 15 (మన్యం మనుగడ) పీ వై ఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గా మండలం పరిధిలోని కొడవటంచ గ్రామానికి చెందిన పర్శిక రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇల్లందు పట్టణంలో సోమవారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర కమిటీ నాయకులు పేర్కొన్నారు. అనంతరం పర్శిక రవి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు అన్నారు. పార్టీ ఎదుగుదల కోసం శాయశక్తులా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు
Post A Comment: