CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అసెంబ్లీలో పోడు సమస్య ప్రస్తావించిన ఎమ్మెల్యే మెచ్చా.

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట: అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం హైదరాబాద్ అసెంబ్లీ సమావేశాలో మాట్లాడుతూ అశ్వరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాలు ఉన్నాయని ఐదు మండలాల్లో గిరిజనులు ఎక్కువగా ఉంటారని వారికి ఉన్నటువంటి 20 సంవత్సరాలు పైగా సాగు చేసుకుంటున్న పోడు భూములు విషయంలో ఇప్పటికీ ఫారెస్ట్ అధికారుల ద్వారా కొంచెం వేదింపులకు గురి అవ్వడం జరుగుతుందని గతంలో ఈ సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు పోవడం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం పోడు కమిటీలు వేసిన సందర్భంలో పోడు భూములకు పట్టాలు కోసం దరఖాస్తులు పెట్టుకోవడం జరిగిందని దరఖాస్తులు స్వీకరించిన తర్వాత కూడా ఫారెస్ట్ అధికారులు గిరిజనుల యొక్క పోడు భూముల్లో ట్రెంచ్లు కొడుతూ ఇబ్బందులు పాలు చేస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క సమస్యకి పరిస్కారం చూపాలని వేడుకున్నారు. దీనికి ప్రతి స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దరఖాస్తులు స్వీకరించడం జరిగింది కాబట్టి, త్వరలనో పోడు భూములు వున్నా నియోజక వర్గాల్లో ఆ శాసన సభ్యుల సమక్షంలో పరిష్కారం మార్గం చూపుతానని హామీ ఇచ్చారు.

Share it:

TS

Post A Comment: