.
మనుగడ వెబ్ డెస్క్::
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిభందనలు పాటించి రోడ్ ప్రమాదాలు నివారించాలని ట్రాఫిక్ ఎస్ ఐ తిరుపతి కోరారు .శనివారం ఉదయం స్థానిక గోళ్లగట్టా రోడ్ లోని క్రీడామైదానం అడ్డాలోని ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగు నిర్వహించారు .పెండింగు చలానాలు ఫ్రభుత్వం కల్పించిన రాయితీ సదుపాయం వినియోగించుకుని చెల్లించాలన్నారు .
ప్రతీ ఆటో సంభందిత ధ్రువపత్రాలు కల్గి ఉండాలని ,ఆటోలలో డెక్కులు తొలగించాలి అన్నారు .నిర్ణీత వేగంతో ఆటోలు నడపాలని ,పరిమితికి మించి ప్రయాణకులను ఎక్కించ వద్దని సూచించారు .డ్రంక్ అండ్ డ్రైవ్ తో వాహనాలు నడపరాదని ,సెల్ ఫోన్ మాట్లడుతూ డ్రయివింగ్ చేయొద్దని హెచ్చరించారు .నిభందనలు ఆతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని తెలిపారు .
Post A Comment: