గుండాల మార్చి 25(మన్యం మనుగడ) పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై కేంద్రం పెనుభారం పీ వై ఎల్ జిల్లా కార్యదర్శి పర్షిక రవి అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం మండల కేంద్రంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇ అయిన నాటి నుండి దేశంలో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి అని ఆయన అన్నారు. కరోనా కారణంగా దేశంలోని ప్రజలు ఇబ్బందులకు గురి అవుతుంటే కేంద్ర ప్రభుత్వం నెలకోసారి ధరలు పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపిందన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు నరేష్ , పి డి ఎస్ యు రాష్ట్ర నాయకులు రాజేష్ , పి వై ఎల్ నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: