CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా డబల్ బెడ్రూమ్ ఇల్లు..ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తికానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కరెంటు నీటి సౌకర్యం ఏర్పాటు ఎప్పుడు....

Share it:



  • అధికారులు పాటించుకోవడం లేదు ,అని బాధితులతో ఆదివాసీ రాష్ట్ర నాయకులు కామరాజు డిమాండ్..


మన్యం టివి దుమ్ముగూడెం::

దుమ్ముగూడెం మండలం అంజిపక గ్రామపంచాయతీ సంబంధించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి కాకుండానే లబ్ధిదారులకు లాటరీ పద్ధతి ద్వారా ఎమ్మార్వో అలాట్మెంట్ చేయడం జరిగింది డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 2020 దసరా పండుగ రోజున ప్రారంభోత్సవం ఉంటుందని అప్పటి అధికారులు తెలియజేశారు కానీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కరెంటు, నీరు, రోడ్డు సదుపాయానికి నోచుకోవడం లేదు అలానే ఇళ్ల నిర్మాణంలో ఇంకా పూర్తి కావలసిఉంది ఇళ్ల చుట్టూ పెద్ద పెద్ద చెట్ల పొదల్లో మొలిచి ఉన్నాయి అలానే కొంతమంది యువ కులు దీన్ని ఆసరాగా తీసుకొని అసాంఘిక కార్యక్రమాలకు పేకాట ,మందు ఇంకా ఇతరేతర పనులకు వాడుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా పనులు పూర్తి చేసి ఎవరికైతే లాటరీ పద్ధతి ద్వారా అలాట్మెంట్ చేశారు వారికి అప్పగించి వలసిందిగా ఆదివాసి రాష్ట్ర ఉపాధ్యక్షులు సోయం కామరాజు డిమాండ్ చేశారు అలాగే స్థానిక ప్రజా ప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మారుమూల ఆదివాసి గ్రామాలలో కనిపించడంలేదని ఎద్దేవా చేశారు తక్షణమే అంజి పాక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు గుమ్మాలు, కిటికీలు, డోర్లు త్వరగా పనులు పూర్తిచేసి అందజేయాలని కోరారు. గుత్తేదారు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకున్నారు ఈ కార్యక్రమంలో సరియం వెంకటేశ్వరరావు, వెంకటేష్, పోడియం అనిత ,మడకం రాంబాబు, దేవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: