CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు సాగుదారుని పరామర్శించిన గిరిజనసంఘం నాయకులు.

Share it:

 


 మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని కన్నాయిగూడెం గ్రామానికి చెందిన పోడు సాగుదారుడు సుతారి శ్రావణ్ కుమార్ అనే యువ పోడు సాగు రైతు గత మూడు రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు ఆయన పోడు భూమిలో కందకాలు తీసి మొక్కలు నాటుతామని నోటీసులు చూపించి హెచ్చరించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించారు. అనంతరం బాధితుని కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స చేయించారు. ప్రథమ చికిత్స అనంతరం స్వగ్రామానికి వచ్చిన బాధితుని ఆదివాసి గిరిజన సంఘం నాయకులు పినపాక మండల అధ్యక్షులు దుబ్బ గోవర్ధన్, కరకగూడెం మండల ఆదివాసి గిరిజన సంఘం అధ్యక్షురాలు తోలెం జ్యోతిక మండల కార్యదర్శి చర్ప సత్యం పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒకవైపు ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామని దరఖాస్తు స్వీకరించిన. మరోవైపు ఫారెస్ట్ అధికారులు పోడు భూములను లాక్కొని మొక్కలు నాటే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. మరలా ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమాలు ఫారెస్ట్ అధికారులు చేస్తే తమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఫారెస్ట్ అధికారులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం పినపాక మండల కార్యదర్శి పూనెం నరసింహారావు, కరకగూడెం మండల నాయకులు కొమరం కాంతారావు, మండల కమిటీ సభ్యులు భీమరాజ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: