CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శ్రీ జ్వాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లే రహదారికి భూమిపూజ.

Share it:


  • నాలుగు లక్షల 50 వేల రూపాయలతో మంజూరైన గ్రావెల్ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎంపీపీ రేగా కాళిక

మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని రుద్రవరం గ్రామ అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ జ్వాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు 4 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రావెల్ రహదారికి కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జ్వాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్వయంగా ప్రభుత్వ వెతుకు పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పరిశీలించి తక్షణమే భక్తుల సౌకర్యం నిమిత్తం వెంటనే నాలుగు లక్షల 50 వేల రూపాయలతో రోడ్డు మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ రేనార్డ్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య సీనియర్ నాయకులు రెడ్డి వెంకటరెడ్డి రేగా సత్యనారాయణ,సమత్ బట్టుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు పోలెబోయిన కృష్ణారావు, టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల. ప్రవీణ్,పోగు ఎల్లగౌడ్,సత్యనారాయణ, వెంకన్న ఆలయ పూజరి పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: