CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జీవో నెంబర్ 48 ను వెంటనే రద్దు చేయాలి -గ్రామ పంచాయతీ జిల్లా కమిటీ సభ్యులు యం అప్పన్న.

Share it:



మన్యంటీవి, అశ్వారావుపేట:గ్రామపంచాయితీ సిబ్బంది తో పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సెంటర్లో మరుగుదొడ్లు కడిగించే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి అని, జీవో నెంబర్ 48ను రద్దు చేయాలని గ్రామ పంచాయతీ జిల్లా కమిటీ సభ్యులు యం అప్పన్న డిమాండ్ చేశారు. శనివారం జీవో ప్రతులను దగ్దం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అప్పన్న మాట్లాడుతూ మల్టీ పర్పస్ విధానం తో పని భారం తో సతమతమవుతున్న సిబ్బంది తో మరుగుదొడ్లు కడిగించే జీవో తీసుకురావడం అన్యాయం అని అన్నారు. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దే మాకు పీఆర్సీ వర్తింప చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది కి ఉద్యోగ భద్రత కల్పించి పర్మినెంట్ చేయాలని, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, పియఫ్, ఇఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్, కామేశ్వరరావు, నందు, నాగేంద్ర, నాగభూషణం నాగేశ్వరరావు నరసింహారావు, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: