CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణా రాష్ట్రం లో ఖాళీగా ఉన్న అన్ని శాఖల నోటిఫికేషన్లు ఇచ్చి తక్షణమే భర్తీ చేయాలి--:డి.వై.ఎఫ్.ఐ. జిల్లా కమిటి..

Share it:

 



మన్యం మనుగడ మంగపేట.

రాష్ట్రముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించిన 80039 పోస్టుల భర్తీతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కాదని డి. వై.ఎఫ్.ఐ ములుగు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాగటి చిన్నా ,రత్నం ప్రవీణ్ లు అన్నారు. బుధవారం వారు స్థానిక పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిఆర్ బిశ్వాల్ కమిటి నేతృత్వంలో పిఆర్సి నివేదిక ప్రకారం 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రిపోర్టు ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు శాసనసభలో 80039 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్స్ ఇస్తామని ప్రకటించడం సరియైందికాదన్నారు.

రాష్ట్రముఖ్యమంత్రి శాసనసభలో,వివిధ ఎన్నికల‌ సందర్భంగా అనేక ప్రకటనలు చేశారు. ఈసారి ప్రకటనలకు పరిమితం కాకుండా తక్షణమే నియమకాల ప్రక్రియకై ఒకేసారి నోటిఫికేషన్స్ వేసి పోస్టులను భర్తీ చేయాలన్నారు.రెండవసారి అధికారంలోకి వచ్చే ముందు ఇస్తానన్న నిరుద్యోగ భృతి 2018 నుండి ఇప్పటివరకు నిరుద్యోగులకు రావాల్సిన భృతి ఇవ్వాలని, అదేవిధంగా ఏడేండ్ల కాలంలో‌ భర్తీ లేక,భృతి లేక యాభై మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలకు ప్రభుత్వమే భాద్యత వహించి నిరుద్యోగ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.టి.ఎస్.పి.ఎస్.సి లో నిరుద్యోగ యువత వన్ టైం రిజిస్ట్రేషన్ లో 28 లక్షలకు పైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిరుద్యోగులందరీకీ ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడానికై అన్ని జిల్లాలో ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలన్నారు. బుధవారం శాసనసభలో ప్రకటించినవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్‌ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా,ప్రకటనకే పరిమితంకాకుండా ఖాళీగా ఉన్న 1,91,126 పోస్టులన్నింటికి తక్షణమే నోటిఫికేషన్స్ వేసి భర్తీ చేయాలన్నారు.

Share it:

TS

Post A Comment: