ములకలపల్లి:మార్చి09(మన్యం మనుగడ)న్యూస్:
సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ములకలపల్లి మండల కమిటీ ఆద్వర్యంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్ర బోస్(రవన్న) 6వ వర్ధంతి సభ స్థానిక ప్రజాపంథా కార్యాలయంలో పార్టి మండల కార్యదర్శి కల్లూరి కిషోర్అధ్యక్షతన జరిగింది.
ఈ వర్ధంతి సభలో సీపీఐ ఎం ఎల్ ప్రజాపంధా జిల్లా కార్యదర్శి కెచ్చెలరంగారెడ్డి మాట్లాడుతు కామ్రేడ్ రవన్న 2016 మార్చి 9న అమరుడైనాడు.అప్పుడే 6సంవత్సరాలు గడిచిపోయాయని,కామ్రేడ్ రవన్న ఇంకా మన కళ్ళ ముందు కర్తవ్య బోధ చేస్తున్నట్లుగానే వుందన్నారు.మనకు విప్లవ ప్రజాపంథా గురించి బోదిస్తున్నట్లుగానే ఉందని,భారత విప్లవోద్యమం గురించీ ,దాని ఇబ్బందులు గురించీ,అది ఎదగాల్సిన తీరు గురుంచీ అనేక సిద్దాంత గ్రంధాలను చదివి.ప్రజాపంథాకు అందించారని.కామ్రేడ్ రవన్న 48 సంవత్సరాల రహస్య విప్లవోద్యమంలో ప్రజల కోసం,అనేక ఆటు పోట్లు లను ఎదుర్కోని రాటు దేలిన విప్లవ యోదుడని,ఉక్కు క్రమ శిక్షణ కలిగిన నాయకుడని ఆయన అన్నారు.భారత విప్లవోద్యమంలో అతివాదం, మితవాదం రెండు కవల పిల్లలని,నిజమై ప్రజాపంథాకు దారులు వేసాడని,అందుకే కామ్రేడ్ రవన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని ఆయన పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టి జిల్లా నాయకులు.ముద్దా బిక్షం,నూపా భాస్కర్,పోతుగంటి లక్ష్మణ్,మండల నాయకులు ఈసం అశోక్,యర్రగొర్ల రామారావు.పాత గంగారం ఎంపిటిసి మడకం విజయ,కారం వెంకటేశ్వర్లు, నకిరకంటి నాగేశ్వరరావు తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: