CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తిరిగి ఇంటి బాట పట్టిన చత్తిష్ గడ్ రాష్ట్రం వలస కూలీలు.

Share it:

 


మన్యం మనుగడ ,వాజేడు:


ములుగు జిల్లాలోని పలు మండలాల్లోకి, పెద్ద ఎత్తున కూలీలు వలస వస్తున్నారు. వాజేడు,వెంకటాపురం,ఎటునాగారం,కన్నాయిగూడెం, తదితర ప్రాంతాల్లోని భారీగా సాగుచేసే మిర్చి పంట ఏరేందుకు వేలమంది కూలీలు వస్తారు.ఒక్కో మహిళా కూలీ నెలల్లో ఖర్చులన్నీ పోను రూ.15వేల వరకు సంపాదిస్తారు. రెండుమూడు నెలలు పనిచేసుకొని వెళ్తున్నారు.బస్తర్‌, బీజాపూర్‌ ప్రాంతాల్లోని ఆవుపల్లి, కొండపల్లి, భీమారం, కుందన్‌పల్లి, కుంజర, గంగులూరు, తొండపార, కొవ్వుపార, బద్దిపార, బైరన్‌గాడ్‌ తదితర గ్రామాల నుంచి 5 వేలమంది కూలీలు ఏటా వస్తుంటారు. ఒక్కో వలస కుటుంబం సీజన్‌లో రూ.25 నుండి 30వేలవరకు సంపాదిస్తున్నారు.

ఈ సంవత్సరం మిర్చి తోటలు ప్రకృతి వైపరీత్యం వల్లన,ఆదిలోనే అంతం కావడంతో వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ముందే స్వగృహానికి కాలినడకన బారులు తీరిన వలస కూలీలు.

Share it:

TS

Post A Comment: