గుండాల మార్చి 20 మన్యం మనుగడ) రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది .మండలం పరిధిలోని కాచన పల్లి గ్రామంలో కొమరారం పోలీస్ స్టేషన్ మూలమలుపు వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో లో ఇద్దరి పరిస్థితివిషమంగా ఉంది. కరకగూడెం గ్రామానికి చెందిన బుగ్గల రాజేందర్, బంగారు గూడెం చెందిన పునెం విష్ణు మూర్తి లు ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా జమల పల్లి గ్రామానికి చెందిన ఉపేందర్ కాంచనపల్లి వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో కరకగూడెం గ్రామానికి చెందిన రాజేందర్ ఆర్, జమల పల్లి కి చెందిన ఉపేందర్ వీరిరువురి పరిస్థితి ఇ విషమంగా ఉంది. కాచన పల్లి నుండి 108 వాహనంలో ఇల్లందు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు
Post A Comment: