మన్యం టీవీ చర్ల:
ఈ రోజు వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో నాలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి విజయకేతనం ఎగరవేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ చర్ల మండల అధ్యక్షుడు నక్కా కన్నయ్య ఆధ్వర్యంలో చర్ల మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ సెంటర్ పోలీస్ స్టేషన్ అంబేద్కర్ బొమ్మ, బంకు మీదగా పురవీధులలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో తెలంగాణలోని కార్యకర్తలపై మరింత బాధ్యత పెరిగిందని ఈ విజయం కచ్చితంగా ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుందని ఈ విజయంతో తో అధికార పార్టీలో ఆత్మవిశ్వాసంతో ప్రతి కార్యకర్త పనిచేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలుపుకు కృషి చేయాలని సీనియర్ నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట క్రాంతికుమార్, అధికార ప్రతినిధి లంక వెంకట్, ప్రధాన కార్యదర్శి పొగాకు పూర్ణచంద్, ఉపాధ్యక్షులు ముత్తారం రత్తయ్య ,సిరిపురపు రాఘవులు, కార్యదర్శి ఆలం సమ్మయ్య ,నుపా రమేష్ ,యువ మోర్చా డివిజన్ కన్వీనర్ నల్లూరి ఉదయభాస్కర్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రఘు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లోకనాథం,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు పగడాల శ్రీధర్, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు గంగరాజు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు పృథ్వి, దళిత మోర్చా మండల అధ్యక్షులు సాయి కృష్ణ,కూరమ్ రమేష్, కొమరం సత్యనారాయణ, పొడియం నరసింహారావు, బందెల జై కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: