మన్యం మనుగడ, పినపాక:
మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకొని ఏడూళ్ల బయ్యారం అటవీ క్షేత్ర అధికారి తేజస్వి ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అటవీ క్షేత్ర కార్యాలయం నుండి ర్యాలీగా ఏడూళ్ల బయ్యారం ఎక్స్ రోడ్డుకు చేరుకొని, సిబ్బందితో కలిసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ క్షేత్ర అధికారి తేజస్వి మాట్లాడుతూ, అడవులను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అడవులను నరికి వేస్తే భవిష్యత్ కాలంలో దుష్పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి అడవులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీ క్షేత్ర కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: