CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పాఠశాలలు మరియు అంగన్వాడి స్కూల్స్ లో సమస్యలు అడిగి తెలుసుకున్నా సర్పంచ్ నారం రాజశేఖర్.

Share it:

 



మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీలో మల్లాయిగూడెం గ్రామం, పండువారిగూడెం గ్రామాలలో సర్పంచ్ నారం రాజశేఖర్ పాఠశాలలు మరియు అంగన్వాడి స్కూల్స్ లలో సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిదంగా అంగన్వాడి స్కూల్స్ లో రికార్డ్స్ వెరిఫికేషన్ చేసి, పిల్లలకు సరైన ఆహారం పెడతున్నారో లేదా అని అడిగి తెలుసుకోవడం జరిగింది. మరియు స్కూల్స్ పిల్లలకి సరైన భోజనం అందిస్తున్నారో లేదో తెలుసుకొని పరిశీంచడం జరిగింది. అనంతరం పండువారిగూడెం నుండి మల్లాయిగూడెం గ్రామానికి వెళ్లే రహదారి లో బ్రిడ్జి రిపేరింగ్ వర్క్స్ చేస్తుంటే దగ్గర ఉండి నాణ్యత ను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆయనతో పాటు ఉప సర్పంచ్ తోడం బుచ్చప్ప, స్కూల్స్ టీచర్స్ సీతారాములు, కాంతారావు, వసంతరావు, అంగన్వాడి టీచర్స్ సుజాత, వేదవతి, జయ కుమారి పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: