- త్వరలోనే జిల్లా టీఆర్ఎస్ శ్రేణులకు అందుబాటులోకి కార్యాలయం
- టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, విప్ ,ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం మనుగడ, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(కొత్త దామోదర్ గౌడ్):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైటర్ బస్తి లోని నూతన టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం పరిశీలించారు.ఈ
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోరం కనకయ్య , టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యాలయం లో కొన్ని పనులు పూర్తి కాకపోవడం పట్ల రేగా అసహనం వ్యక్తం చేశారు. గుత్తేదారుకు సంబంధించిన వివరాలు సేకరించారు. త్వరలోనే జిల్లా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు జిల్లా కార్యాలయం అందుబాటులోకి తీసుక రావడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: