గుండాల ఫిబ్రవరి 1 (మన్యం మనుగడ) తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు అని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ అన్నారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, పిల్లలతో కలిసి బెలూన్లను ఎక్కడ వేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ, యువజన విభాగం అధ్యక్షులు హజ్జు, బీసీ సెల్ మండల అధ్యక్షులు గడ్డం రమేష్ , మైనారిటీ సేల్ అధ్యక్షులు సుభాని, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాములు, అధికార ప్రతినిధి రాము, నాయకులు బత్తిని రమేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: