- పినపాక మండల సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో పిలుపునిచ్చిన ఏ ఎస్ పి శబరీష్.
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లోని జి వి ఆర్ ఫంక్షన్ హాల్ లో మాదకద్రవ్యాల నిర్మూలన గురించి బుధవారంనాడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మణుగూరు ఏ ఎస్పీ డాక్టర్ శబరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు బానిసై, మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నారని, ఈ కారణంగా వారి జీవితంతో పాటు కుటుంబం మొత్తం నష్టపోతుందని తెలియజేశారు. గ్రామాలలో ముఖ్యంగా సర్పంచు సెక్రటరీలు ముఖ్య పాత్ర పోషిస్తారని, మాదకద్రవ్యాలను తీసుకునే వ్యక్తులను గుర్తుపట్టి తమకు తెలియజేయాలని, అదేవిధంగా దాని వలన జరిగే నష్టాన్ని గురించి వివరించాలని తెలియజేశారు. అటువంటి వారు ఎవరైనా తారసపడినట్లయితే, పోలీసువారికి సమాచారం అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం సిఐ రాజగోపాల్, ఎస్సై టి వి ఆర్ సూరి, పంచాయితీల సర్పంచ్ లు, సెక్రటరీలు పాల్గొన్నారు
Post A Comment: