మన్యంటీవి, అశ్వారావుపేట:ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందించారు. అశ్వారావుపేట మండల పరిధిలోని వినాయకపురంకు చెందిన జల్లిపల్లి త్రినేష్ విద్యుత్ ఘాతుకానికి గురయ్యారు, అలాగే నీలం శ్రీనివాసరావు లారీ ప్రమాదంలో క్షతగాత్రుడు అయ్యాడు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సూచన మేరకు స్థానిక సీనియర్ తెరాస నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు ఆద్వర్యంలో మంగళవారం ఈ ఆర్ధిక సహాయాన్ని వారికి అందజేసారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం పిఎసిఎస్ అద్యక్షులు నిర్మల పుల్లారావు, చందా లక్ష్మి నర్సయ్య, ఉప్పల సాంబశివరావు, మురళి, ప్రసాద్, నాగ మహేశ్వరరావు, మాజీ సర్పంచ్ పొట్టా రాజులు, ఎంపిటిసి మారుతి లలిత, తమ్మిశెట్టి శ్రీను, దుర్గారావు, సత్యనారాయణలు పాల్గొన్నారు.
Post A Comment: