గుండాల ఫిబ్రవరి 8( మన్యం మనుగడ) టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పై టిడిపి నాయకులు సంధాని తప్పుడు ఆరోపణలు మానుకోవాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. రేగా పై తప్పుడు ఆరోపణలు చేయడం ఆయన దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. రైతుల కోసం అనేకమార్లు రేగా కాంతారావు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు నిలిచిన సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకులతో కలసి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. పోడు రైతులకు న్యాయం చేసే సత్తా ఉన్న ఒకే ఒక్క నాయకుడు రేగా కాంతారావు అన్నారు. త్వరలోనే రేగా కాంతారావు ఆధ్వర్యంలో కూడా రైతులకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని అప్పుడు ఇలాంటి వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సమ్మయ్య , నాయకులు గడ్డం రమేష్ , నిట్ట రాములు, లక్ష్మీనారాయణ, రాము, నాగన్న
Post A Comment: