CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెరాస పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయండి.కార్యకర్తలకు, మండల నాయకులకు దిశానిర్దేశం చేసిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా....

Share it:

 



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: గ్రామాల్లో పార్టీ పటిష్టతపై దృష్టి సారించాలని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు చండ్రుగొండ మండల నాయకులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. మంగళవారం కొత్తగూడెంలోని సింగరేణి గెస్ట్ హౌస్ లో ఆయనను చండ్రుగొండ మండల నాయకులు కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. రైతుల కోసం తీసుకొచ్చిన పథకాలైన రైతుబంధు, ఉచిత కరెంటు, రైతు బీమా, దాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ, రుణమాఫీ వంటి పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం లో పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ఆయనను కలిసిన వారిలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు మాలోత్ బోజ్య నాయక్, సారెపల్లి శేఖర్, ఎంపీపీ భానోత్ పార్వతి,వైస్ ఎంపీపీ నరకుల్లా సత్యనారాయణ, గానుగాపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య,బానోతు రాముడు తదితరులు కలిశారు.

Share it:

TS

Post A Comment: