- ముఖ్య మంత్రి కెసిఆర్ గారు అసెంబ్లీ లో ప్రకటించిన ప్రకారం పే స్కేల్ జీఓ వెంటనే విడదల చేయాలి.
- 55 యేండ్లు దాటిన విఆర్ఏ ల వారుసలకు ఉద్యోగాలు ఇవ్వాలి.
- అర్హత కల్గిన విఆర్ఏ లకు ప్రమోషన్లు ఇవ్వాలి.
- కరోనా తో మరణించిన విఆర్ఏ లకు 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.
- రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.
మన్యం మనుగడ ములుగు
హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద విఆర్ ఏ ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహా ధర్నా వారికి సంఘీ భావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.ఈ సందర్భంగా మాట్లాడుతూ.రెవెన్యూ వ్యవ స్థలో కింది స్థాయి ఉద్యోగులు గా ఉంటూ ప్రభుత్వానికి ప్రజల కు మధ్య అనుసంధానం
ఉంటూ విధులు నిర్వహి స్తున్నారు.ప్రభుత్వం పెట్టే సర్వేలు సంక్షేమ పథకాలలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తు న్నారు.ఇంత చాకిరి చేస్తున్నా వీఆర్ఏల ను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించకపోవడం దుర్మార్గమన్నారు.గ్రామసేవకులకు కనీస వేతనం చెల్లించా లని,రెవెన్యూ వ్యవస్థను గ్రామ పంచాయతీలో విలీనం చేయ డం ప్రభుత్వానికి తగదని,విమ ర్శించారు.ప్రతి నెల ఒకటో తారీకున జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.గ్రామ సేవకులను కోనసాగించాలని డిమాండ్ చేశారు.55 సంవ త్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని,వీఆర్ఏలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.పీఆర్సీ కమిటీ సిఫారసు ప్రకారం కనీస వేతనం రూ.19వేలు ఇవ్వాలని,అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.కరోనాతో మరణించిన వీఆర్ఏల కుటుంబాలకు రూ. 50లక్షల ఎక్సిగ్రేషియా అందిం చాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Post A Comment: