చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: గుంపెన సహకార సంఘంలో రుణాలు తీసుకున్న రైతులు వడ్డీలు చెల్లించి తమ ఖాతాలను రెన్యువల్ చేయించుకొని, ప్రభుత్వం నుండి వచ్చే మూడు శాతం రాయితీని పొందాలని గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ రైతులకు సూచించారు.బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మార్చి నెలాఖరు వరకు రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీలను చెల్లించాలన్నారు. గుంపెన సహకార సంఘంలో గేదెలు, ద్విచక్ర వాహనాలను తీసుకున్న రుణాలకు నూటికి నూరు శాతం వసూలు చేయడం జరిగిందన్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో రూ. 60 లక్షల అంచనా వ్యయంతో 500 మెట్రిక్ టన్నుల గోదాములను నిర్మించటం జరుగుతుందన్నారు. సహకార సంఘనికి రైస్ మిల్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపటం జరిగిందన్నారు.
Post A Comment: