మన్యం మనుగడ, మణుగూరు:తెలంగాణ రాష్ట్రం లో పోడు భూముల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని త్వరలోనే అర్హులైన వారికి పోడు భూమి హక్కు పత్రాలు మంజూరు చెయ్యడం జరుగుతుంది అని కృషి:ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేగా కి కరకగూడెం మండలం రేగళ్ల గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు పోడు భూములు సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేశారు. త్వరలోనే పోడు భూములకు శాశ్వత పరిష్కారం చేసి పట్టాలు అందజేస్తామని ఈ సందర్భంగా రేగా కాంతారావు వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రేగళ్ల పొడుసాగుదారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: