మన్యం మనుగడ ప్రతినిధి(కొత్త దామోదర్ గౌడ్),భద్రాద్రి కొత్తగూడెం:
పాల్వంచలోని కెటి పి ఎస్ 1104 యూనియన్ వ్యవస్థాపకులు సంగం జంగయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, విప్ ,ఎమ్మెల్యే,భద్రాద్రి జిల్లా టీఆరెస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు , జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య లు సంఘం జగ్గయ్య పార్ధివ దేహాన్ని సందర్శించి, పూలమాలవేసి, ఘన నివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసినారు.సంఘం జగ్గయ్య గౌడ్ కి నివాళ్ళు అర్పించిన వారిలో
వనమా రామకృష్ణ
, పాల్వంచ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, పెద్దమ్మ గుడి డైరెక్టర్ చింత నాగరాజు, ముత్యాల ప్రవీణ్, దాసరి నాగేశ్వరరావు, ఉర్దూ గర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: