మన్యం టీవీ, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు చింతిర్యాల కాలనీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెన్న అశోక్ కుమార్ మాట్లాడుతూ పోడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని అటవీశాఖ అధికారులను హెచ్చరించటం జరిగింది.ఆర్ వో ఎఫ్ ఆర్ పరిధి 2005 నుండి 2014 వరకు పెంచాలి.ఆదివాసి బిడ్డలు సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు తక్షణమే కందకాల తవ్వకం నిలుపుదల చెయ్యాలని ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టం పరిధి 2005 నుండి 2014 వరకు పెంచాలని పినపాక నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు, చింతిరాల ఉపసర్పంచ్ వెన్న అశోక్ కుమార్ తెలియజేశారు. పోడు సాగు దారులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
Post A Comment: