మన్యం మనుగడ, మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు జిల్లా వైద్య అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. మణుగూరు మండలం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రులో పోస్టుమార్టం రూమ్ కొరకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.ప్రసూతి సదుపాయాలు మరియు ఆపరేషన్ థియేటర్ కావలసిన ఇతర సదుపాయాల గురించి తదితర అంశాలపై చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ముక్కు వెంకటేశ్వర్లు రావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గిరి ప్రసాద్, నేత్ర వైద్యులు డాక్టర్ . సంజీవ్ రావు, జూనియర్ అసిస్టెంట్ లు . వెంకటకిరణ్, సతీష్, ఉపేందర్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: