CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండలంలో బంద్ ప్రశాంతం..

Share it:

 



మన్యం టివి దుమ్మగూడెం:

మండలంలో బంద్ కు సంపూర్ణంగా సహకరించిన వ్యాపార వర్గాలకు ఉద్యోగస్తులకు రైతులకు కార్మికులకు ప్రజలులకు అఖిలపక్ష పార్టీలు నాయకులు ధన్యవాదాలు తెలియజేశారుఅఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ-ఆంధ్ర లో కలిపిన కన్నాయిగూడెం పిచ్చికలపాడు ఎటపాక పురుషోత్తపట్నం గుండాల ఈ 5 గ్రామపంచాయతీలు తెలంగాణలో కలపాలని ఈరోజు బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు అదేవిధంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పాండురంగాపురం నుండి రైల్వే లైన్ భద్రాచలం వరకు పొడిగించాలని అనేక దశాబ్దకాలంలో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఆ సమస్య నేటికీ నెరవేరలేదని అలాగే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.దుమ్ముగూడెం మండలంలో నరసాపురం నుండి పర్ణశాల వరకు ర్యాలీ చేయడం జరిగింది .

 ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య, సిపిఐ మండల కార్యదర్శి కుంజా శ్రీను , తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కొమరం దామోదర్, రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లంక శ్రీనివాసరావు, ఎమ్మెల్ పార్టీ మండల నాయకులు సున్నం వీరభద్రం ఏ వి ఎస్ పి డివిజన్ అధ్యక్షుడు మల్లుదొర , సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ, యలమంచిలి శ్రీనుబాబు, సరియం రాజమ్మ, సిపిఐ పార్టీ మండల నాయకులు నోముల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: