మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలను పర్యటిస్తు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న బీఎస్పీ నాయకులు తమ పర్యటన లో భాగంగా బుధవారం మండల పరిధిలోని గ్రామం నరసింహసాగర్ ను సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.గ్రామస్తుల మాటల్లో ఇక్కడ 30 ఏండ్లు గా నివసిస్తున్నా కూడ ఇంతవరకు మాకు ఎటువంటి ప్రజా సంక్షేమ పథకాలు అందటం లేదు కనీసం ఇంటి పన్ను కూడా కట్టించుకోవడం లేదు గ్రామ పంచాయతీ లు కూడ ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు కనీసం మమ్మల్ని ప్రజలుగా గుర్తించడం లేదు కనీసం మమ్మల్ని మనుషులు గా గుర్తించి మాకు ఇంటి స్థలాలు కేటాయించి ఇండ్లు కట్టించండి లేదు అంటే ఉన్న మా గుడిసెలకు ఇంటి పన్ను కట్టించుకోండి అని అన్నారు. గ్రామం లోని యువత మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరికి వచ్చినపుడు అన్ని పార్టీల వారు వచ్చి హామీలు ఇస్తారు తర్వాత ఒక్కరూ కనపడరు, ఇకనుండి మీ పార్టీ లకు తొత్తులగ మారి మీ మాయ మాటలు నమ్మి మోస పోయేది లేదు ఎవరు మంచి, ఎవరు చెడు తెలుసుకున్నాం మీ జెండాలను మోసి మోసి, మా భుజాలు క్రుంగి పోయాయి, ఇకనుండి మీ జెండాలను మా భుజం మీది నుండి దింపి మా బహుజనులు అభివృద్ధి అజెండా ఎత్తుకుంటాం మా భవిష్యత్ ను మార్చుకుంటాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో బీఎస్పీ ములుగు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంపెల్లి వీరస్వామి తదితర బీఎస్పీ ముఖ్య నాయకులు యువత పాల్గొన్నారు.
Post A Comment: