గుండాల ఫిబ్రవరి 16 ( మన్యం మనుగడ) మండలం పరిధిలోని పోతిరెడ్డి గూడెం గ్రామ కమిటీ సభ్యులు ఉకే పుల్లయ్య మరణం ఈ ప్రాంత ఆదివాసి ఉద్యమానికి తీవ్ర నష్టమని సిపిఐ (ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం అన్నారు. బుధవారం పోతిరెడ్డి గూడెం గ్రామంలో జరిగిన ఊకె పుల్లయ్య సంతాప సభలో వారు మాట్లాడుతూ
న్యూడెమోక్రసీ పార్టీ కోసం ఆయన వెలలేని కృషి చేశారన్నారు. ఎన్నో అవరోధాలు వచ్చినా ప్రతిఘటన దళాలను కాపాడటంలో ఎంతో కృషి చేశారని అన్నారు. ఇలాంటి వ్యక్తిఅకాల మరణం చెందడం న్యూ డెమోక్రసీ పార్టీ కి, ఈ ప్రాంత ఆదివాసి ఉద్యమానికి తీవ్ర నష్టమని అన్నారు.
ఈ కార్యక్రమంలో గుండాల జడ్పిటిసి వాగబోయిన రామక్క, గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు, న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు పెండ కట్ల పెంటన్న, ఈసం మంగన్న, వై వెంకన్న, గడ్డం లాలయ్య, ఎస్కేఅఙ్గార్,ఊకె బాబు, చింత నర్సన్న, ప్రగతిశీల యువజన సంఘం( పీ వై ఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి పర్శక రవి,ఊకె వెంకన్న, చింత కోటేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: