- అటవీశాఖ అత్యుత్సాహం మానుకోవాలి
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం కిష్టాపురం పంచాయితీలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో పోడు సాగు దారుల కొరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల ఎంపిపి గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, అటవీశాఖ అధికారుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని, పొడు పోరుకు అందరూ సిద్ధంగా ఉండాలని, టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోడు సాగుదారులకు అండగా ఉంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: