మన్యం మనుగడ, పినపాక :
పినపాక మండలం అమరారం గ్రామ పంచాయితీ కొత్తూరులో గల శ్రీరామ యూత్కు రేగా విష్ణు ఛారిటబుల్ ట్రస్ట్ తరుపున రూ.10 వేలు ఆర్దిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అందించిన ఆర్దికసహయాన్ని ఎంపిపి ,మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. కొత్తూరులో శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వాలీబాల్ టోర్నీకి రేగా ట్రస్ట్ తరుపున వితరణ అందజేశారు. శ్రీరామ యూత్ సేవలు మరింత పెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య,అమరారం సర్పంచ్ మొగిలిపల్లి నర్సింహారావు,ఎంపీటీసీ కాయం శేఖర్, పీసా కమిటీ అధ్యక్షులు బిజ్జా రమేష్, గ్రామ పెద్ద బిజ్జా సమ్మయ్య, సర్పంచ్లు బాడిశ మహేష్, గొలుసుల నాగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ పొనుగోటి కామేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గాండ్ల అశోక్, గొంది నాగభూషణం, తోలెం శ్రీనివాస్, బోడ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: