CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జూనియర్ అసిస్టెంట్ పి సతీష్ కుమార్ హఠాత్ మరణం..

Share it:

 



మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 23, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పి సతీష్ కుమార్ (53) మంగళవారం రాత్రి వైరా లోని తన నివాసంలో హఠాత్ మరణం చెందారు. 21 వ తారీకు న ఎంతో ఉత్సాహంగా తన విధి నిర్వహణలో భాగంగా జూలూరుపాడు మండల పరిషత్ కార్యాలయంలో సీఎం గిరి వికాస్ పథకం దరఖాస్తులను రైతుల నుండి స్వీకరించిన వ్యక్తి మరణించారన్న వార్త తెలియగానే మండల ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. పి సతీష్ కుమార్ ఇటీవలనే ఖమ్మం జిల్లా నుండి బదిలీపై జూలూరుపాడు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎంపిపి లావుడ్యా సోనీ, ఎంపీడీవో రవి, ఎంపిఓ రామారావు హుటాహుటిన వైరా వెళ్లి వారి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరితో పాటు సీనియర్ నాయకులు బి శ్రీనివాసరావు, పంచాయతీ సంఘం అధ్యక్షులు బి అనంతకుమార్, పంచాయితీ కార్యదర్శులు, టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గూగుల్ రాంబాబు, బానోతు మంగులాల్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Share it:

TS

Post A Comment: