మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం ఏజెన్సీ ప్రాంతంలోని యువత క్రీడల్లో రాణించాలని
జి/141 సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ ఐ రవి కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి సునీల్ దత్ ఆదేశాలపై శనివారం లక్ష్మీ నగరం, లచ్చి గూడెం, అడవిరామవరం గ్రామాల్లో యువతకు దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ & జి/141 బెటాలియన్ ఆధ్వర్యంలో వారు క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా యూత్ కుర్రాళ్లు ఆటలో రాణించారు. ఏజెన్సీ యువతలో ఉన్న క్రీడ సామర్ధ్యం వెలికి తీయడం లో దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ శాఖ తమ వంతు సేవ అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: