CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు సాగు దారులతో సమావేశం అయిన ఎంపీపీ.పోడు భూములలో ఫారెస్ట్ అధికారులు కందకలు తవ్వితే తరిమి కొట్టండి ఎంపీపీ రేగా

Share it:

 



మన్యం మనుగడ కరకగూడెం:మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలోని గ్రామస్తులతో సమావేశమైన ఎంపీపీ రేగా కాళికా, జడ్పిటిసి కొమరం కాంతారావు. ఈ సందర్భంగా పోడు సాగుదారులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాలమెరకు పోడుసాగుదారులతో సమావేశం ఎర్పాటు చెయ్యడం జరిగిందని, ఒక్క పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఅర్ పోడు సాగుదారులకు పట్టాలు ఇస్తాం అంటుంటె అటవీశాఖ అధికారులు మాత్రం సీఎం కేసీఆర్ మాటలు వినకుండా మరో వైపు అటవీశాఖ అధికారులు మాత్రం అతి ఉత్సాహం ఉపయోగించి పోడు భూములలో కందకాలు తిస్తాం అంటు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇలా చేస్తె ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్పుతారు అని అన్నారు.ఎన్నో ఎల్లనుండి పోడు సాగు చేసుకుంటున్న భుములలో కందకాలు తవ్వే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు.అటవీశాఖ అధికారులు అతి ఉత్సాహం ఉపయోగించి దౌర్జన్యాలకు పాల్పడితే తగిన గుణపాఠం ప్రజలు చెప్పుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు టిఆర్ఎస్ పార్టీ మడల అధ్యక్షులు రావుల సోమయ్య, నాయకులు రేగా సత్యనారాయణ, గ్రామస్తులు, ఈసం సత్యం, కొమరం లక్ష్మీ నర్సయ్య ఉప సర్పంచ్ ఈసం సమ్మయ్య సూతరి నాగేశ్వరరావు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: