మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఆర్టీసీ సిబ్బంది కి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది.మేడారం సమ్మక్క,సారక్క ల జాతర జరుగుతున్న సందర్బంగా, మణుగూరు నుండి కొన్ని వందల బస్సులలో వెళుతున్న ఆర్టీసీ సిబ్బంది,డ్రైవర్ లు, కండక్టర్ లు,సుదూర ప్రాంతాల నుండి,మణుగూరు మీదుగా మేడారం జాతరకు భక్తుల ను చేరవేయడం జరుగుతుంది అని,వారికీ సమయానికి భోజనం దొరకడం కూడా కష్టంగా ఉంది అన్నారు.ఈ మేరకు మణుగూరు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో రోజుకి 100 మందికి 15.2.2022 తేదీ నుండి 18.2.2022 వరకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమం లో ప్రెసిడెంట్ నాగేశ్వరావు,సెక్రటరీ గాజుల. పూర్ణ చందర్ రావు,బీవీబీ ఆనంద్,డీసీ రమేష్ కుమార్, డాక్టర్ సమ్మయ్య,నాగేశ్వరావు, అడబాల,ట్రెజర్ భూక్య తార, ఇతర సభ్యులు,ఆర్టీసీ డి ఎం విజయ్ కుమార్,మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: