CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏళ్లనాటి స్వప్నం సాకారం అవుతున్న వేళ.పినపాక మండలంలోని మారేడుగూడెం గ్రామానికి వంతెన నిర్మాణం.

Share it:

 


  • గత పాలకుల పాలనలో నిర్లక్ష్యం - రేగా పాలనలో సుభిక్షం


మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాక గ్రామం నుండి మారేడు గూడెం అనే గ్రామానికి ఒకప్పుడు వర్షాకాలంలో వెళ్లాలంటే సవాలు తో కూడుకున్న విషయం. వరదలు వస్తే మారేడు గూడెం ప్రజల ఇక్కట్లు వర్ణణాతీతం. అలాంటి పరిస్థితి నుండి తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితో 35 లక్షల వ్యయంతో వంతెన నిర్మాణం జరగనుంది. ఈ నిర్మాణం పూర్తయితే, మారేడు గూడెం ప్రజల సంతోషానికి అవధులు ఉండవు. ఏళ్ల నాటి కల సాకారం అవుతున్నందుకు, మారేడు గూడెం ప్రజలు నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గత పాలకుల పాలనలో నిర్లక్ష్యంగా ఉన్న మారేడు గూడెం వంతెన, రేగా కాంతారావు కృషితో పూర్తి అవుతున్నందుకు, తమ గ్రామాన్ని కలిపే రహదారి నిర్మాణం జరగబోతున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: