మన్యం టీవి న్యూస్:
కరోనా కారణంగా మూసివేసిన విద్యాసంస్థలను ప్రారంభించిన సందర్భంగా ప్రభుత్వ విద్యా సంస్థలలో శానిటైజర్ చేపట్టి విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని పి డి ఎస్ యు కొత్తగూడెం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు యనగంటి వంశి వర్ధన్, నరేందర్ పి డి ఎస్ యు పట్టణ కార్యదర్శి ఎ. పార్థసారధి డిమాండ్ చేశారు. ఈరోజు పి డి యస్ యూ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణ సహాయ కార్యదర్శి తరుణ్ అధ్యక్షతన నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. విద్యాసంస్థలలో కరోనా ప్రాబల్యం పెరగకుండా పరిశుభ్రతను పాటించే విధంగా చర్యలు చేపట్టాలని అదేవిధంగా విద్యార్థులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరియు ఆశ్రమ వసతి గృహాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో ప్రతి రోజు గుడ్లు,ఫ్రూట్స్ తో పాటు జీడిపప్పు బాదం పప్పు లాంటి పౌష్టిక ఆహారాన్ని అందించే విధంగా మెనూ షెడ్యూల్ ను ప్రకటించాలని అదేవిధంగా మటన్ చికెన్ లాంటి ప్రోటీన్ ఆహారాన్ని అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. పౌష్టిక ఆహారాన్ని అందించినప్పుడే కరోనా వైరస్ ని ఎదుర్కొనే సామర్థ్యం విద్యార్థుల్లో కలుగుతుందని వారు తెలియజేశారు.కరోనా కేసులు పెరగగానే విద్యా సంస్థలను మూసి వేయకుండా కరోనా నియమ నిబంధనలు పాటించాలని సంక్షేమ పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసే పాలక ప్రభుత్వాలు భావితరానికి బాటలు వేసే విద్యార్థుల సంక్షేమానికి ప్రణాళికంగా అభివృద్ధి బడ్జెట్ ను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సి,శృతి, సాహితీ,సౌజన్య,కుమారి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: