చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: ఆదివాసి ఎమ్మెల్యేల జోలికొస్తే సహించేది లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు కుంజా నాగేంద్రబాబు హెచ్చరించారు.బుధవారం వంకనెంబర్ గ్రామంలో జరిగిన ఆదివాసిల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆదివాసీలు ఎందులో తక్కువ కాదని, మా ఎమ్మెల్యేల ఎదుగుదలను ఓర్వలేక,లంబాడి హక్కుల సమితి( ఎల్ హెచ్ పి ఎస్) నాయకులు, పినపాక ఎమ్మెల్యే, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ను విమర్శించడం సరికాదన్నారు.ప్రభుత్వంలో ఉన్న ఆదివాసి ప్రజాప్రతినిధులను కించపర్చటం సరికాదన్నారు. ఈ సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు బొర్ర ప్రసాద్, పైదా ప్రసాద్, తాటి రాంబాబు, కుంజా శివకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: