మన్యం మనుగడ కరకగూడెం:ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసినా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ,టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఆదేశాలమెరకు,ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపులో భాగంగా కరకగూడెం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పై నల్ల బ్యాడ్జీలు,జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, బూర్గంపాడు వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు మాట్లాడుతూ లాభాల బాటలో ఉన్న ఎల్ఐసి,సింగరేణి సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని,నరేంద్ర మోడీ చుస్తున్నారని అన్నారు. మొన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ నికి సరైన న్యాయం చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కొమరం విశ్వనాధం, పోలెబోయిన నరసింహారావు,ఉపసర్పంచ్ రావుల రవి టిఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి, కొంపెల్లి పెద్ద రామలింగం,రేగా సత్యనారాయణ, ఎలిపెద్ది శ్రీనివాస్ రెడ్డి, వాసిరెడ్డి నేతాజీ, బైరిశేట్టి చిరంజీవి, కొమరం సత్యనారాయణ, పోలెబోయిన కృష్ణారావు, యూత్ వైస్ ప్రెసిడెంట్ కటకం లెలిన్ సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్ కుమార్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: