CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాజ్యాంగాన్ని అవమానిస్తే సహించం.వెంటనే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.

Share it:

 


  • తెలంగాణ సమతా సైనిక్ దళ్, భానాసా దళిత సంఘాల డిమాండ్‌.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

భారత రాజ్యాంగాన్ని ఎవరు అవమానించిన సహించబో మని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ హెచ్చరించారు.ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి భారత రాజ్యాంగం వర్ధిల్లాలని, అంబెడ్కర్ ఆలోచనా విధానం వర్ధిల్లాని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలని అవహేళన చేసిన కేసీఆర్‌ దేశ ప్రజలందరికీ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.తన జీవితాన్ని ఫణంగా పెట్టి అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించి దేశానికి అందించారని, అనాడు మనువాదం చేత దేశంలో దళితులు,ముస్లింలు, బడుగు,బలహీన వర్గాలను బానిసలుగా చేసి చదువుకు దూరం చేసిందన్నారు.చీకటి సమాజం నుంచి వెలుగులోకి రాజ్యాంగం తోనే వచ్చామని గర్వంగా చెబుతామన్నారు. అందరికీ ఓటుహక్కు,ప్రజా స్వామ్యంలో కల్పించిన మహానుభావుడు అంబేడ్కర్‌ అని అన్నారు.ఆయన రచించిన రాజ్యాంగాన్నే అవమానిస్తే ఎంతటి వారి నైనా క్షమించబోమన్నారు.ఈ కార్యక్రమంలో భారత నాస్తిక సామాజం ములుగు జిల్లా అధ్యక్షుడు కొండగొర్ల రాజేష్, సమతా సైనిక దళ్ నాయకులు జనగం కేశవ రావు,పాగ నాగరాజు,ఎమ్మార్పీఎస్ నాయకులు వావిలాల స్వామి వావిలాల సాంబశివరావు, పడిదల సతీష్,ఏంపెల్లి లక్ష్మయ్య,మాలమహానాడు నాయకులు మాదరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: