గుండాల ఫిబ్రవరి 5 (మన్యం మనుగడ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించాలని అధ్యక్ష అభ్యర్థి కురిచేటి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. శనివారం మండల కేంద్రంలోని గుండాల మండల అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు నివాసంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఆర్యవైశ్య సంఘానికి ఎల్లవేళల అందుబాటులో ఉంటూ ఎదుగుదలకు కృషి చేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల మండల అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు, మానాల నారాయణమూర్తి, మానాల ఉపేందర్, మానాల ప్రభాకర్, గౌరిశెట్టి సత్యనారాయణ, గౌరిశెట్టి ప్రభాకర్, తాటిపల్లి సత్యం,టి. నాగరాజు, టి రాము, శ్రీశైలం, నాగమల్లయ్య ,టి వీరన్న తదితరులు పాల్గొన్నారు
Post A Comment: