గుండాల ఫిబ్రవరి 5 (మన్యం మనుగడ) యువత మారక ద్రవ్యాల జోలికి పోవద్దని ఇల్లందు డిఎస్పి రవీందర్ రెడ్డి సూచించారు. శనివారం మండలం పరిధిలోని కాచన పల్లి (కొమరారం) పోలీస్ స్టేషన్లో ఫారెస్ట్ గ్రామస్తులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొందరు అడ్డదారిన డబ్బు సంపాదించాలన్న భావనతో గంజాయి పంట సాగు చేస్తున్నారని అలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. మారక ద్రవ్యాలు ఉపయోగించడం వల్ల జీవితం అంతమవుతుందని యువత అలాంటివాటికి దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల సీఐ కరుణాకర్, ఎస్ ఐ. రమణారెడ్డి,అటవీశాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: