మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో అశ్వారావుపేట మరియు వినాయక పురం ప్రభుత్వ వైద్య శాలలలో వచ్చిన పేషెంట్లు కూర్చోవడానికి వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్ లేనందున రెండు వైద్య శాలలో వెయిటింగ్ హాల్ మరియు చుట్టూ ప్రహరీ గోడను నిర్మింపచేయలని ఎమ్మెల్యే సూచనలు మేరకు అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి నవంబర్ లో భద్రాచలం ఐటీడిఏ పిఓకి వినతీ పత్రం అందజేయటం జరిగింది. దీనికి స్పందించిన ఐటీడిఏ పిఓ గౌతమ్ మండలం లో పర్యటించిన నేపథ్యంలో హాస్పిటల్స్ రెండిటికీ కుడా ప్రపోజల్స్ వచ్చాయని త్వరలోనే ఆ రెండూ హాస్పిటల్స్ లో వెయిటింగ్ హాల్, ప్రహరీ గోడలు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని తెలపడంతో అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి హర్షం వ్యక్తం చేస్తూ ఐటీడిఏ పిఓకి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే అశ్వారావుపేట మండలంలో వున్న ఎస్టీ బాలుర విద్యార్థులకు వుండటానికి వసతి గృహం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలియజేశారు. దానికి పిఓ స్పందించి గిరిజన వసతి గృహమును కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులూ, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: