మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని గురవాగు తండా గ్రామపంచాయతీ సర్పంచ్ బోడా బోజ్యా సతీమణి లక్ష్మి (50) అకాలంగా సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకొన్న వైరా శాసనసభ్యులు రాములు నాయక్ మంగళవారం లక్ష్మి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరితో పాటు సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు యదళ్ళపల్లి వీరభద్రం, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Post A Comment: