మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని మాచినేని పేట తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఐదు అంగన్వాడి కేంద్రాలకు 314 కేజీల బియ్యాన్ని గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా మంగళవారం పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి విద్యా లత పాల్గొని పర్యవేక్షించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లాకవాత్ భారతి, ఉప సర్పంచ్ లాకవాత్ బుజ్జి, ఎంపిటిసి బి నీల, జెడ్ పి టి సి భూక్య కళావతి, ఎం పి ఓ రామా రావు, సూపర్ అటెండెంట్ రవి, ఏ పీ ఓ సుహాసిని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: