మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో నూతన హంగులతో రూ.70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మణుగూరు నూతన బస్టాండ్ నిర్మాణ పనులను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అధికారులతో కలిసి పరిశీలించారు. జరుగుతున్న పనుల వివరాలను అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, ఆర్టీసీ డి ఎం విజయ్ కుమార్, మున్సిపల్ అధికారులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని. బాబురావు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యంబాబు, యువజన అధ్యక్షులు హర్ష నాయుడు,రుద్ర వెంకట్, నాయకులు కృష్ణ,బాబీజాన్ నర్సింహారావు,గణేష్,పార్టీ నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: