మన్యం మనుగడ కరకగూడెం:
మండల పరిధిలోని అనంతరం గ్రామ పంచాయతీలో గల కొత్తూరు గ్రామానికి చెందిన అనంతరం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఈసం ముత్తయ్య ( 50) సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందారు .విషయం తెలుసుకున్న మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య స్థానిక సర్పంచ్ బత్తిని నరసింహారావు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలువేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపల్లి పెద్ద రామలింగం మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు పాయం రాజబాబు నాయకులు అత్తే .నరసయ్య ముకుంద,పసునూరి అంజయ్య, వెంకటేశ్వర్లు, నరసింహులు , వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: